టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి అవమానం జరిగింది. ప్రతి సంవత్సరం గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్, మంత్రులు.. ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ ను సన్మానిస్తున్నారు. ఈసారి మాత్రం మనవడు గోపాల కృష్ణని జిల్లా అధికారులు, మంత్రులు పట్టించుకోలేదు. ఏదో మొక్కుబడిగా డీఆర్వో శ్రీనివాసరావు శాలువా కప్పి వెళ్లిపోయారు. దీంతో టంగుటూరి గోపాలకృష్ణ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కొత్తరాజ్యాంగాన్ని తయారు చేస్తున్నట్టు ఉందని, దీన్ని ప్రజలు గమనించాలని గోపాల కృష్ణ అన్నారు.
previous post
next post