సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం కోదండరామపురం గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి DMFT నిధుల ద్వారా విడుదలైన రూ.10 లక్షల రూపాయలతో CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన నలబోలు వెంకటరెడ్డి కుటుంబానికి పార్టీ ప్రమాదభీమా కింద 2 లక్షల చెక్కును శానంపూడి అందచేశారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన ధ్యేయమని, పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడెం వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి, ఇతర నాయకులు , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.