పార్టీ కోసం పని చేసిన వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొన్ని రోజుల క్రితం మరణించిన కోడేర్ మండలం నర్శాయిపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కొమ్మ శేషమ్మ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కును ఆయన నేడు అందచేశారు.
పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్సు ఉంటుందని, అకాల మరణం సంభవించిన కార్యకర్తలను అది ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కొమ్మ శేషమ్మ కుటుంబానికి పార్టీ చేసిన ఇన్సూరెన్సు కు సంబంధించిన రెండు లక్షల రూపాయల చెక్కును కుమారుడు నర్శాయిపల్లి గ్రామసర్పంచ్ సత్యం యాదవ్ కు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అందచేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ అధిష్టానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, పేద మరియు బడుగు బలహీన వర్గాల, రైతుల పక్షపాతి తెరాస పార్టీయేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.