కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కళ్యాణి ఇంటర్ ఫలితాల్లో ఎంపిసి విభాగంలో 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా పదవ తరగతిలో, ఐఐటి మెయిన్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది.
అత్యుత్తమ మార్కులు కనబర్చిన కళ్యాణిని ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, డాక్టర్ కొత్తపల్లి అనిత దంపతులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము 20 మంది పదవ తరగతి విద్యార్థులకు ఫీజులు చెల్లించగా వారిలో ఒకరైన కల్యాణి ఇంటర్ లో స్టేట్ టాపర్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఉన్నత చదువులకై ఎటువంటి ఆర్ధిక సహాయం కావలసిన వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తాము చేస్తామని వారు ప్రకటించారు. అదేవిధంగా శ్రీ కొత్తపల్లి వెంకట లక్మి – చంద్రయ్య మెమోరియల్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో కల్యాణికి అవసరాల నిమిత్తం ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తామని అందులో భాగంగా ఈరోజు కళ్యాణి కి ఐదు వేలు ఆర్ధిక సహాయం అందజేసామని అన్నారు.