కరోనా వైరస్ ప్రభావంతో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో జరుగుతున్న అంతర్జాతీయ విమానప్రదర్శన వెలవెలబోతున్నది. నిన్న ప్రారంభమైన వెంగ్స్ ఇండియా 2020 నేడు కూడా సందర్శకులు లేక బోసి పోయింది. రెండు సంవత్సరాలకు ఒక సారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అంతర్జాతీయ విమాన ప్రదర్శన లో ఈ సారి చాలా దేశాల నుంచి విమానయాన సంస్థలు రాలేదు.
కరోనా వైరస్ కారణంగా వారంతా ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. విదేశాల నుంచి రావాల్సిన కంపెనీలు అన్నీ కరోనా వైరస్ కారణంగా మొహం చాటేశాయి. కేంద్రం నుంచి పాల్గొనాల్సిన మంత్రులు కూడా ప్రధాని ఆదేశాలతో ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. అన్ని రకాలుగా అందరూ గైర్హాజర్ కావడంతో అంతర్జాతీయ విమాన ప్రదర్శన కరగిపోయినా కలలాగా మిగిలి పోయింది.