సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నేడు ఐ ఎన్ టి యుసి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ PCC అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కేకు కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఐఎన్టియుసి ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనా వైరస్ తగ్గేంత వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టాలలో ఉన్న పేదవారిని ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని, ఆకలి బాధలతో ఉన్న వారిని ఆదుకోవడంలో కార్యకర్తలు ముందు ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్, ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య, ఐఎన్టియుసి హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు మేళచెరువు ముక్కంటి, ఐఎన్టియుసి హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడు పాశం రామ్ రాజ్ యాదవ్, జక్కుల మల్లయ్య, మిల్లు డ్రైవర్ అధ్యక్షుడు సలిగంటి జానయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి పోత బోయిన రామ్మూర్తి, ఐఎన్టీయూసీ నాయకులు అంబటి వెంకట బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.