కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా, కుక్కడం గ్రామంలో నేడు విశాఖ విబోర్డ్స్ కంపెనీ గజలాపురం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేయవద్దని అన్నారు. ఈ మేరకు కార్మికుల సమస్యలపై యాజమాన్యానికి డిమాండ్ నోటీసు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో INTUC యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు నూక పొంగు నాగయ్య,MPTC మాధవ రెడ్డి,యూనియన్ అధ్యక్షులు రాములు, విజయ్, పోలగాని శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.