35.2 C
Hyderabad
April 24, 2024 13: 00 PM
Slider క్రీడలు

ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..

IPL 2022 కొత్త సీజ‌న్ గురించి హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. టి 20 ప్రపంచ కప్ జ‌రుగుతున్నా కూడా ఐపిఎల్ చర్చ ముగియడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే 15 వ సీజన్ IPL కోసం స‌ర్వం సిద్దం చేసింది. మొదటి దశ సన్నాహాలు వచ్చే వారం పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా BCCI రెండు కొత్త ఫ్రాంచైజీలను ప్రకటించనుంది.

ఆ రెండు కొత్త ఫ్రాంచైజీలను ఎవరు ద‌క్కించుకుంటార‌నే దానిపై పోటీ ఆస‌క్తిగా మారింది. అనేక పెద్ద కంపెనీలు ప్రాంచైజీల కోసం పోటీప‌డుతున్నాయి. ఇటీవల ఒక నివేదిక ప్రకారం.. బాలీవుడ్ సూపర్ క‌పుల్ కూడా ఈ రేసులో ఉంద‌ని తెలిసింది.

సూపర్‌స్టార్లు రణవీర్ సింగ్‌, దీపికా పదుకొనే కొత్త ప్రాంచైజీ కోసం వేలం వేయనున్నారు. ఈ ఇద్ద‌రు కూడా సినిమాలతో పాటు క్రీడా అభిమానులు కూడా. అయితే దీపిక, రణ్‌వీర్ తమంతట తాము వేలం వేస్తున్నారా లేదా ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి మరికొంత మంది వాటాదారులతో క‌లిసి పోటీ ప‌డుతారా అనేది స్పష్టంగా తెలియ‌లేదు.

ఐపీఎల్‌తో బాలీవుడ్‌కు బలమైన అనుబంధం ఉంది. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌, న‌టి జుహీ చావ్లా 2008 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులు. అదే సమయంలో ప్రీతి జింటా, వాడియా గ్రూప్‌, డాబర్ గ్రూప్‌తో కలిసి 2008 లోనే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. తాజాగా సినిమా పరిశ్రమ నుంచి ఐపిఎల్‌కు మూడో యజమాని రానున్నారు.

Related posts

పిల్లి పిల్లలను మార్చినట్లు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి!

Satyam NEWS

జగిత్యాల పోలీసుల రక్తదాన శిబిరం

Satyam NEWS

సానియా మీర్జా షోయబ్ మాలిక్ ల బ్రేకప్?

Bhavani

Leave a Comment