32.2 C
Hyderabad
March 28, 2024 22: 47 PM
Slider ముఖ్యంశాలు

ఏపీ లో 16 మంది ఐపీఎస్ ల బదిలీలు

#AndhraPradeshSecretariat

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు.

విజయనగరం ఎస్పీ రాజకుమారికి డీఐజిగా పదోన్నతి కల్పించారు. ఆమెను దిశా డీఐజీగా నియమించారు. అదే విధంగా డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగానూ రాజకుమారికి బాధ్యతలు అప్పగించారు. విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక ను నియమించారు.

సి.హెచ్.విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ చేశారు. తూ.గో. జిల్లా ఎస్పీగా ఎం.రవీంద్రనాథ్ బాబును నియమించారు. అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా బదిలీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌ నియామకం జరిగింది.

రిశాంత్‌రెడ్డి గుంటూరు జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. సతీశ్‌కుమార్‌కు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా నియమించారు. విద్యాసాగర్‌ నాయుడు కు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు.

వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్​గా​ పోస్టింగ్ ఇచ్చారు. అదే విధంగా ఎస్ .సతీష్ కుమార్ ను​ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా నియమించారు. విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబీ అదనపు ఎస్పీగా ప్రభుత్వం నియమించింది.

గరికపాటి బిందు మాధవ్​ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు.

అదే విధంగా పి జగదీష్ ను​ విశాఖపట్నం జిల్లా, పాడేరు సహాయ ఎస్పీగా బదిలీ చేశారు. జి కృష్ణకాంత్​ను తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ సహాయ ఎస్పీగా నియమించారు. వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.

కృష్ణకాంత్ పాటిల్ ను తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.

Related posts

మెగా ఇంజనీరింగ్ కంపెనీపై ఐటి దాడులు

Satyam NEWS

ఘనంగా దత్త జయంతి వేడుకలు

Bhavani

ఛీటింగ్: ప్రేమికుడిపై కోపంతో ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment