28.7 C
Hyderabad
April 24, 2024 05: 56 AM
Slider సంపాదకీయం

తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న వైసీపీ మంత్రులు

#Chandrababu Naidu TDP

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కరోనా వైరస్ ను తీసుకువచ్చారని ఒక మంత్రి చెబుతాడు. మద్యం షాపుల వద్దకు చంద్రబాబునాయుడు డబ్బులిచ్చి కార్యకర్తల్ని పంపి అక్కడ సామాజిక దూరం పాటించకుండా చేస్తున్నాడని ఇంకో మంత్రి అంటాడు.

ఈ రెండు స్టేట్ మెంట్లు చూసిన వారిలో ఎంత మంది వాటిని నమ్మారో తెలియదు కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం నిత్యం చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అడుగుపెడితే 14 రోజులు క్వారంటైన్ కు పంపుతామని ఒక మంత్రి చెప్పాడు. అదే ఇంకో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో దాక్కున్నాడు అంటారు. ఎంత కాలం ఈ చంద్రబాబు భజన?

చంద్రబాబునాయుడి పాలనపై అసహ్యంతో కదా వైసీపీని ఎన్నుకున్నది. 151 సీట్లు వచ్చిన వైసీపీ నిత్యం చంద్రబాబు నామ స్మరణ ఎందుకు చేయాలో అర్ధం కావడం లేదు. రాజకీయంగా ఏ మాత్రం ప్రభావం చూపించలేని స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల నాటికైనా కోలుకుంటారో లేదో తెలియదు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ నాయకులు చంద్రబాబునాయుడిని ప్రతి దానికి స్మరిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక మహాశక్తిగా ఉన్నట్లుగానే చేస్తున్నారు. ఏదైనా ఒక వైఫల్యం రాగానే చంద్రబాబును విమర్శించడం వైసీపికి అలవాటు అయింది. ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు ఉంటాయి, మరి కొన్ని ప్రజలకు కష్టం కలిగించేవి ఉంటాయి.

లేదా ప్రజలు అంగీకరించనివి కూడా ఉంటాయి. అంత మాత్రాన విమర్శలు రాగానే ఇదంతా చంద్రబాబు నాయుడి కుట్ర అని చెబుతుండటంతో నిజంగా చంద్రబాబునాయుడు ఇంత శక్తిమంతుడా అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయంగా కనుమరుగు అవుతున్న తెలుగుదేశం పార్టీని వైసీపీ మంత్రులు బతికిస్తున్నారు.  

Related posts

విశాఖ అరకు రోడ్ పై ప్రమాదం: ఒకరి మృతి

Satyam NEWS

డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్

Satyam NEWS

ఏపి సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌

Satyam NEWS

Leave a Comment