31.7 C
Hyderabad
April 25, 2024 02: 42 AM
Slider విశాఖపట్నం

బీజేపీ జనసేన మధ్య ముగిసిన పొత్తు?

#bjpmlcmadhav

బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నది. విజయవాడ లో జరిగిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. జనసేనతో కలిసి ఉన్నాం. కానీ కలిసున్నా లేనట్టేనని భావిస్తున్నాం అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదు. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంది. కానీ ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా చేయలేదు. మాతోనే జనసేన కలిసి రావడం లేదనేది మా ఆరోపణ అని ఆయన తెలిపారు. పదాధికారుల సమావేశంలో పార్టీ బలోపేతం చేసే అంశంపైనే చర్చించామని తెలిపారు.

Related posts

హైకోర్టు జడ్జి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ

Bhavani

నిర్నీత గడువులోగా లే అవుట్లకు అనుమతులు

Bhavani

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

Bhavani

Leave a Comment