39.2 C
Hyderabad
March 28, 2024 14: 07 PM
Slider రంగారెడ్డి

నెల రోజులు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తే తప్ప కరోనా ఆగదు

#gaddamprasadkumar

నెల రోజులు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తే తప్ప కరోనా ఆగదు దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తే తప్ప కరోనా అదుపులోకి వచ్చే అవకాశం లేదని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అందుకోసమే వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు స్వీయ నియంత్రణను పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.

అవసరం అయితే తప్ప బైటికి రావద్దని ఆయన కోరారు. కరోనా విరుచుకు పడుతున్న సమయంలో అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.

మాస్క్ లేనిదే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి… మీ మీ కుటుంబాలలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి … వివాహాలు, శుభకార్యాల సీజన్ మొదలు కాబోతుంది వచ్చే 4 వారాలు కీలకం అని వైద్య శాఖ హెచ్చరిస్తున్న సందర్భంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

పేద ప్రజల ఇండ్లు చిన్నగా ఉంటాయి ఒకే రూమ్ తో ఉంటాయి కాబట్టి ఎవరికైనా కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా సోకితే మిగతా కుటుంబం అంత వ్యాపిస్తుంది కనుక వారు దయచేసి మీ గ్రామంలో/మీ కాలనిలో ఉన్న ప్రభుత్వ బిల్డింగులు, డ్వాక్రా సంఘాల భవనాలని, పాఠశాల భవనాలలో ఐసోలేట్ కావాలని కోరారు.

దీనికి గ్రామ సర్పంచ్ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న  సందర్భంగా ఎల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన అన్నారు.

Related posts

(Best) Cbd Oil Pure Relief Cbd Oil Legal In Nevada

Bhavani

వ్యాధుల నివారణే లక్ష్యంగా మణిపాల్ గుడ్ హెల్త్ రన్

Satyam NEWS

ఆదాయపు పన్ను ఎగవేతపై ఆరా

Bhavani

Leave a Comment