దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా కరోనా ఐసోలేషన్ కోచ్ లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో కాచిగూడ రైల్వే స్టేషన్లో ఐసోలేషన్ కోచ్లు అందుబాటులోకి రానున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్లో 40 ఐసోలేషన్ కోచ్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే 19 బోగీలను ఐసోలేషన్ కోచ్లుగా మార్చారు.
మిగతా బోగీల్లో పనులు చురుకుగా సాగుతున్నాయి. ఒక్కో కోచ్లో 13 మంది కరోనా అనుమానితులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. మొత్తం 500 మందికి చికిత్స అందించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.