27.7 C
Hyderabad
April 25, 2024 07: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్

లక్కీ పోలీస్ :హత్య కేసు విచారిస్తుంటే ఐఎస్‌ఐ ఏజెంటు దొరికాడు

iss terrorist in srikaakulam

పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంటుగా అనుమానిస్తున్న ఓ వ్యక్తితో పాటు మరో ముగ్గురిని శ్రీకాకుళం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక హత్య కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనుహ్యంహ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంటు చిక్కడం గమనార్హం.వివరాల్లోకి వెళితే ముంబయి నుంచి పశ్చిమబెంగాల్‌కు టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీని ఏవరో అడ్డగించి అందులోని డ్రైవర్‌ను హత్య చేశాడు. ఆ హత్యోదంతంపై పోలీసులు దర్యాప్తు చేయగా ఉగ్రవాద కోణం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన ఎన్‌.ఐ.ఎ. అధికారులు ఆ లారీ ఎటువైపు వెళ్తుందన్న విషయంపై ఆరా తీశారు. విశాఖ పోలీసులను అప్రమత్తం చేశారు. చివరికి శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద పోలీసులకు చిక్కారు.అనంతరం వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య విశాఖ నగరానికి తరలించారు. రహస్య ప్రదేశంలో ఉంచి వారిని విచారిస్తున్నారు.

Related posts

రామ‌తీర్ధంలో శైవ క్షేత్రాన్ని సంద‌ర్శించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

రాష్ట్రం లో మైనార్టీలకు రక్షణ లేదు: టిడిపి నాయకులు

Satyam NEWS

మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంటిపై ఏసీబీ దాడి

Satyam NEWS

Leave a Comment