వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంపై నేడు ఐటీ దాడులు జరిగాయి.
హైదరాబాద్ లో 15 చోట్ల ఐటీ సోదాలు జరిగినట్లు తెలిసింది.
అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు కొనసాగాయి.
అదే విధంగా గచ్చిబౌలి లోని రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుపగా రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు నిర్వహించారు.
15 బృందాలతో వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.