27.7 C
Hyderabad
April 18, 2024 09: 30 AM
Slider ఆంధ్రప్రదేశ్

శ్రీచైతన్య ,నారాయణ పై ఆదాయపు పన్ను శాఖ దాడి

narayana college

ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి కార్పొరేట్ విద్యాసంస్థలపై పడింది. విజయవాడ కార్పొరేట్ కళాశాలల సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడలోని శ్రీచైతన్య ,నారాయణ సెంట్రల్ ఆఫీస్ లపై ఐటీ అధికారులు నేడు పంజా విసిరారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ కార్యాలయాలలో తనఖీలు ప్రారంభించారు.

ఒక వైపు ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన హడావుడిలో రాత్రింతా సిబ్బంది పని చేశారు. ఉదయాన్నే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో ఒక్క సారిగా యాజమాన్యాలు నిర్ఘాంత పోయాయి. అదీ కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అధిక సంఖ్యలో ఒకే సారి దాడి చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

Related posts

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి బంధువు?

Satyam NEWS

హైదరాబాద్ లో 12 కంటోన్మెంట్ క్లస్టర్ల ఏర్పాటు

Satyam NEWS

పులిచింతల ముంపు బాధితులను ఆదుకుంటాం

Satyam NEWS

Leave a Comment