ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు సంబంధించిన పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది.
సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది. శ్రీనివాస్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.