37.2 C
Hyderabad
April 19, 2024 11: 16 AM
Slider అనంతపురం

ప్రభుత్వం పై జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

#JCDiwakarReddy

అనంతపురం జిల్లా తాడిపత్రి సున్నపురాయి గనుల లీజు విషయంలో భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద జేసీ ఆందోళన చేశారు. అనుమతులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని జేసీ హెచ్చరించారు.

రాష్ట్రంలో నియంత పాలన ఎంత కాలం ఉంటుందో చూస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తమ కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు భవిష్యత్తులో రెండింతలు ఎక్కువగా సన్మానం ఉంటుందని హెచ్చరించారు.

అనవసర విషయాల్లో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు. బదిలీలకు భయపడే అధికారులు తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు.

రాబోయే రోజుల్లో అందరూ ఫలితం తప్పక అనుభవించాల్సిందే అన్న జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు.

Related posts

నరసరావుపేట రోటరీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమలు

Satyam NEWS

క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Satyam NEWS

130 జ్యోతిరావ్ పూలే వ‌ర్థంతి

Sub Editor

Leave a Comment