మూడవ తేదీన జరిగే నిరసన జయప్రదం చేయాలని తెలంగాణ కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కరపత్రం ఆవిష్కరించింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈనెల మూడో తారీఖున నిరసన ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షులు శీతల రోషపతి మాట్లాడుతూ ప్రపంచమంతా తాండవిస్తున్న కరోన ఉన్న టైంలో కార్మికులని, ఉద్యోగులని,పేద ప్రజలను బాధించటం సరైంది కాదని, చట్టాల సవరణ విరమించుకోవాలని, పని గంటలు విధానాన్ని పాత పద్ధతినే అమలు చేయాలని అన్నారు.
రోజువారీగా పెరిగే డీజిల్ _ పెట్రోల్ పెరుగుదల తక్షణమే నిలుపుదల చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు నెలకి 7500 ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఇచ్చే బియ్యం సాంబ మసూరి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 3వ తేవీన జరిగే తాసిల్దార్ కార్యాలయ ముట్టడి నిరసన ప్రదర్శనను విజయవంతం చేసేందుకు కార్మికులందరూ పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీను, సైదులు, దేశబోయిన వెంకన్న, కోటేశ్వరరావు, దుర్గారావు, తదితరులు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.