లాక్ డౌన్ సమయంలో పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయలను వై ఎస్ జగన్ ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో కూడా జగన్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని ఆయన అన్నారు.
వైద్య, పారిశుద్ధ్య ,పోలీస్ అధికారులకు శాలరీతో పాటు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లాక్ డౌన్లోడ్ లో ఉన్న రోజులు ప్రజలకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా నివారణకు జిల్లా చొప్పున కలెక్టర్ ఖాతాలో కోటి రూపాయలు నిధులు మంజూరు చేయాలని అన్నారు.
భావన, చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదినారాయణ రెడ్డి కోరారు. కరోనా పోరులో పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు రోజు చొప్పున 500 ఇవ్వాలని, ఏప్రిల్ 14 తర్వాత లార్డ్ డౌన్ పొడిగించితే రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఓటర్ ఐడికి రోజు చొప్పున 100 ఇవ్వాలని ఆయన కోరారు.