జగన్ ప్రభుత్వం తమ కుటుంబాన్ని మూడేళ్లుగా వేధిస్తోందని అయ్యన్నపాత్రుడి సతీమణి పద్మావతి తెలిపారు. చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా తోసుకుంటూ వెళ్లారని పద్మావతి తెలిపారు. తన భర్తకు దుస్తులు మార్చుకునే అవకాశం కూడా పోలీసులు ఇవ్వలేదని, చెప్పులు కూడా వేసుకునే సమయం ఇవ్వకుండా తోసుకుంటూ వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యన్న అరెస్ట్ను ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభివర్ణించారు.
ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయ్యన్న అరెస్ట్ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఖండించారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.