31.2 C
Hyderabad
February 14, 2025 21: 17 PM
Slider ఆంధ్రప్రదేశ్

వెల్ఫేర్ ప్లాన్: బీసీ సామాజిక వర్గాలను ఆదుకుంటాం

jagan BC

నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని వై ఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేసిన బీసీ అధ్యయన కమిటీ నేడు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నేడు సీఎం విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ,  మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్‌ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ వారితో బాటు బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

10 వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10 లక్షల వరకూ ఉన్నబీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి ఆ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పదివేల లోపు జనాభా ఉన్న సంచార జాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపు నిచ్చి వారు సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూత నివ్వాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. వారికి గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్నదిశగా చర్చజరిగింది.

Related posts

ప్రజల  రక్షణ కోసం బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి

Satyam NEWS

అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

mamatha

Leave a Comment