40.2 C
Hyderabad
April 19, 2024 18: 46 PM
Slider కడప

జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేయాలి

batyala 23

రైతుల విద్యుత్ సమస్యలని తీర్చ కుంటే విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు తప్పవని మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడు హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు.

రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లేదా కారు యాత్ర చేయాలని, వారికష్టాలని కనుగొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు పగలు తొమ్మిది గంటల విద్యుత్ హామీ ఇచ్చిన విధంగా సరఫరా చేయాలని కోరారు. ఆరు నెలలు సరఫరా చేసి పది రోజులుగా ఇవ్వడంలేదని ఆరోపించారు.

పది రోజుల లోపు యధావిధిగా ఇవ్వక పోతే విద్యుత్ సబ్ స్టేషన్ల యెదుట ధర్నా చేస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు రాజంపేట టి.యన్.టి.యు.సి అధ్యక్షుడు మన్నూరు రాజా, రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి భారతాల శ్రీధర్, టీడీపీ నేతలు బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు, టి.యన్.యస్.ఎఫ్   జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివా, సంజీవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫిబ్రవరి 1 నుండి మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

Satyam NEWS

పాత బస్టాండును వినియోగoలోకి తేవాలి

Satyam NEWS

కోటి బతుకమ్మ  చీరలు పంపిణీకి సిద్ధం

Satyam NEWS

Leave a Comment