జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఏపిలో బెనిఫిట్ షో వేయకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని జనసేన నాయకుడు, తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ అన్నారు.
ఏ సినిమా అయినా తొలి రోజు బెనిఫిట్ షో వేసుకోవడం ఆనవాయితీ అని ఆయన అన్నారు. రెగ్యులర్ షో కన్నా ముందు అభిమానుల కోసం వేసుకునే షోను అడ్డుకోవడం అంటే జగన్ రెడ్డి పవన్ కల్యాణ్ ను చూసి ఎంత భయపడుతున్నాడో అర్ధం అవుతున్నదని ఆయన అన్నారు.
వకీల్ సాబ్ సినిమా కోసం కేవలం పవన్ కల్యాణ్ అభిమానులే కాదని, వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా వేచి చూస్తున్నారని ఇంత చిన్న లాజిక్ జగన్ రెడ్డి మర్చిపోయారని ఆయన అన్నారు.
సిఎం జగన్ రెడ్డి పవన్ కల్యాణ్ ను చూసి భయపడుతున్నట్లు తిరుపతి లోక్ సభ ఎన్నికల సందర్భంగా అర్ధం అయిందని అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాను చూసి కూడా జగన్ రెడ్డి భయపడుతున్నాడనే విషయం అర్ధం అవుతున్నదని కిరణ్ రాయల్ అన్నారు.