రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు. కొన్ని రోజుల క్రితం జైపూర్లోని మహారాజా సవాయి మాన్సింగ్ గురుకులంలో కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్లో సెప్టెంబర్ మొదటివారంలో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు తెరచుకున్నాయి. మొదట 50 శాతం విద్యార్థులతో నిర్వహించగా దీపావళి తర్వాత 100 శాతం విద్యార్థులతో తరగతులకు అనుమతినిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటి నుంచే పాఠశాలల్లో వరుసగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు.