40.2 C
Hyderabad
April 24, 2024 16: 01 PM
Slider జాతీయం

ప్లాన్ మిస్: జైషే ఉగ్రవాదుల కుట్ర భగ్నం ఐదుగురి అరెస్ట్

jaise terrorist

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భారీ కుట్రకు ప్రణాళిక చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురిని శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేశామని సెంట్రల్ కశ్మీర్ రేంజ్ డీఐజీ వెల్లడించారు.అరెస్ట్ అయిన ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అరెస్టు చేసిన ఐదుగురిని ఐజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, షఫీల్ ఫరూక్ గోజ్రీ, నసీర్ అహ్మద్ మిర్‌లుగా పోలీసులు గుర్తించారు పుల్వామా సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జేషే పాత్ర ఉందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గత ఏడాది ఫిబ్రవరిలో జేషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు

Related posts

కన్నుల పండుగగా స్వయంభు శ్రీ శంంభులింగేశ్వర స్వామి కళ్యాణం

Satyam NEWS

కండగలిగిన కవిరాయడు గురజాడ

Satyam NEWS

కార్గిల్ అమర వీరుడి ఇల్లు దోచుకున్న దొంగలు

Satyam NEWS

Leave a Comment