జల్లికట్టు తరతరాలుగా తమిళనాట కోనసాగుతున్న సంప్రదాయ ఆట. పొంగల్ సందర్భంగా తమిళనాడులోని మధురైలో జల్లికట్టు ఆట మొదలైంది. అవనియపురంలో సాగుతున్న ఈ జల్లికట్టులో దాదాపు 700 ఎద్దులు పాల్గొంటుండగా అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు.వాటిని నియంత్రించి పోటీలో గెలిచేందుకు 730 మంది క్రీడాకారులు సిద్ధమయ్యారు.
మధురైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరులో కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. మాజీ న్యాయమూర్తి జెమికం, మధురై మున్సిపల్ కమిషనర్, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు.