జామి శివాజీ ఆశయాలు సాధించాలని ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయంలో తాము ఎళ్లవేళలా అండగా ఉంటామని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి పేర్కొన్నారు. జామి శివాజీ రెండవ వర్థంతి సందర్భంగా నేడు శాంతా అనురాగ నిలయంలో వృద్ధులకు, పిల్లలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం లక్ష్మీదేవి మాట్లాడుతూ జామి శివాజీ కుటుంబంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన ఆలోచనలు, ఆచరణలు సదా ఉన్నతమైనవని పేర్కొన్నారు. శివాజీ ఆకస్మిక మరణం తమను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ జామి భీమశంకర్ కుటుంబానికి ప్రతీ ఒక్కరిలో ప్రత్యేక అభిమానం దాగి ఉందని అందరినీ గౌరవిస్తూ, ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారే జామి అని స్పష్టం చేశారు. ఆయన కుటుంబం మరింత ఆయన ఆశయాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జామి శివాజీ సతీమణి, కుమారుడు, సోదరులు, సోదరీ మణులు తదితరులు పాల్గొన్నారు.