32.2 C
Hyderabad
March 28, 2024 22: 38 PM
Slider రంగారెడ్డి

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు

#keesara

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా నేడు కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు నాటారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అదేవిధంగా తను దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ పెద్ద చెరువు దగ్గర జమ్మి చెట్లను మంత్రి మల్లారెడ్డి తో కలిసి జమ్మి మొక్కలను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఊరు ఉరికో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు అని అన్నారు.

ఈ కార్యక్రమం ద్వార ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి చెట్టు నాటడం జరుగుతుంది అని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమని ప్రతి ఒక్కరూ ఇదే విధంగా  గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.

దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెరుగుతున్న పాజిటీవ్ కేసులతో నాగర్ కర్నూల్ జిల్లా అప్రమత్తం

Satyam NEWS

జనవరి 5న విడుదల కాబోతున్న ‘రాఘవ రెడ్డి’

Satyam NEWS

హ్యాపీ బర్త్ డే: కొడుకు పుట్టిన రోజున పేదల్ని ఆదుకున్న తండ్రి

Satyam NEWS

Leave a Comment