జనగామ పట్టణంలో, శివారు ప్రాంతాలలో, నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఇక చిక్కుల్లో పడటం ఖాయం అంటున్నారు పోలీసులు. జనగామ పట్టణంలో ఇలా పబ్లిక్ గా మందు కొట్టే స్థలాలు ఏవి ఉన్నాయని పోలీసులు సర్వే చేసి ఆయా స్థలాలను గుర్తించారు.
ఈ సమాచారం మేరకు గత వారం రోజులుగా పట్టణంలోనూ, శివారు ప్రాంతాలలోనూ పెట్రోలింగ్ ఎక్కువ చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 21 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ డి మల్లేష్ తెలిపారు. ఈ రోజు వారందరిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి జరిమానా విధించి వదిలి పెట్టినట్లు చెప్పారు.
తదుపరి పోలీస్ స్టేషన్ ఆవరణలో వారందరికీ సిఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇది తొలి తప్పుగా భావించి, మరొకసారి రిపీట్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.