36.2 C
Hyderabad
April 16, 2024 19: 11 PM
Slider చిత్తూరు

కరోనా రోగుల కోసం ఆక్సిజన్ కాన్సన్ అందజేసిన జనసేన

#Janasena Tirupathi

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన సెప్టెంబర్ 2వ తేదీన జరగబోతున్నది. ఒక నెల రోజుల ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా “జనసేన సేవా సమితి కువైట్”వారి సమక్షంలో ఆ సంస్థ అధ్యక్షుడు రామచంద్ర నాయక్, వారి మిత్రుల సహకారంతో ఈ రోజు సుమారు 60 వేల విలువ చేసే (ఆక్సిజన్ కాన్సన్ ట్రీట్ మెషిన్) రుయా ఇన్చార్జ్ సూపరింటెండెంట్ నాగ మునిందర్ బాబు కు అందచేశారు.

జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తోడుంటామని నిరూపిస్తున్నారు. కరోనా సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్, కాంచన శ్రీకాంత్, రిటైర్డ్ ఎస్సై కృష్ణయ్య, మధు పగడాల మురళి, కొండా రాజమోహన్ వేమూరి హరి, ఆస్పత్రి మాజీ వర్కింగ్ చైర్మన్ చినబాబు ఆస్పత్రి వైద్యులు సిబ్బంది జనసేన నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఎస్వీబీసీ ఎండిగా ఎవి.ధ‌ర్మారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

Satyam NEWS

ఏపీలో జైళ్లు సరిపోకపోతే లాడ్జిలు బుక్ చేసుకోండి

Bhavani

స్పోర్ట్స్ ఈవెంట్స్ ద్వారా యువతలో చైతన్యం

Satyam NEWS

Leave a Comment