తనను విమర్శించేవారు రాజకీయ పార్టీ నడిపి చూడాలంటూ ఎంతో ఆవేదనతో చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాపం రాజకీయ పార్టీని నడిపేందుకు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. ఆ ఇబ్బంది ఆర్ధిక సమస్యే అనేది వేరే చెప్పనక్కరలేదు. ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకేమో గానీ ఆయన కొత్త చిత్రాన్ని అంగీకరించారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ చేసిన రీ ట్వీట్ తో ఆ విషయం నిజమే అని ఫిక్స్ అయిపోయింది. తన ప్రస్తుత పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా సోషల్ మెస్సేజ్ ఉండే చిత్రాలలో పవన్ నటించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ ఫిలిం కోసం అయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ కచ్చితమైన అవగాహనా ఎవరికి లేకుండాపోయింది ఐతే నేడు అది ఖరారైంది. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రం తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. హీరో నాని తో ఎం సి ఏ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోని కపూర్, దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. పవర్ స్టార్ మరలా సినిమా చేస్తున్నాడని తెలుసుకున్న అయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ మాస్ స్టామినా సిల్వర్ స్క్రీన్ పై చూసే రోజులు ఎంతో దూరం లో లేవు. వెల్కమ్ బ్యాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
previous post