సొంత చిన్నాన్న హత్య కేసులో నిందితులను పట్టుకోలేని అసమర్థత సీఎం జగన్ జన సేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు పెట్టించడం శోచనీయమని జనసేన కడప నగర అధ్యక్షుడు మాలే శివ అన్నారు. కడప నగరంలోని జనసేన కార్యాలయంలో నేడు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
సీఎం చిన్నాన్న వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు న్యాయం జరగడం లేదని ఆయన కూతురు స్వయానా మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తంచేసిన విషయాన్ని మాలె శివ గుర్తు చేశారు. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పవన్ మాట్లాడారని వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడం తగదని ఆయన అన్నారు.
సరస్వతి దేవి పుట్టినిల్లు పులివెందుల అని జనసేనాని పవన్ మాట్లాడారని శివ తెలిపారు. కానీ కొంత మంది వల్ల పులివెందుల కు చెడ్డపేరు వచ్చిందన్నారు……. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది వైసీపీ నాయకుల తీరు… కొంత మంది మంత్రుల మాటలు దొర్లుతున్నాయి….. పవన్ కళ్యాణ్ గురుంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త ….అని ఆయన హెచ్చరించారు.
పవన్ ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవలేదు….వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఓటు నోటు ఇవ్వకుండా గెలిచే సత్తా ఉందా… అని శివ ప్రశ్నించారు. నీతి, నిజాయతీ, నిబద్దత గల రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పై అవాకులు, చవాకులు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి కష్టార్జితం తో రాజకీయాలు చేస్తున్నారు…జనసేన ఎన్నికల్లో డబ్బులు పంచలేదు…అని ఆయన తెలిపారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎం జగన్ కు మంత్రులకు లేదు.. ప్రశ్నించాలంటే అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం… రాష్ట్రాన్ని నవరరత్నాల పేరిట అప్పుల ఊబిలో ఉంచిన ఘనత సీఎం జగన్ కె దక్కుతుందని శివ అన్నారు.