జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలువు మేరకు కడప జిల్లా రాజంపేట పట్టణంలో శనివారం నాడు శ్రమదానంతో రోడ్లు వేశారు. రాజంపేట నుంచి నెల్లూరు, విజయవాడ కనెక్టివిటీ రహదారి పోలి దెగ్గర గుంతలను జనసేన కార్యకర్తలు శ్రమదానం ద్వారా పూర్తి చేశారు.
ముందుగా పట్టణంలోని మహాత్ముని విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించి, శ్రమ దాన కార్యక్రమంను నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పిలుపు మేరకు అన్ని నియోజక వర్గాలలో రాష్ట్ర ప్రభుత్వం 24 నెలలో చేయలేనిది 24 గంటల్లో ప్రజల సౌకర్యం కోసం రహదారుల గుంతలు పూడ్చడం జరిగిందని జనసేన నాయకులు తెలిపారు.
అధికార పార్టీ వారు చేసుకొనే సన్మానాలకు కార్యక్రమాలను కోవిడ్ నిబంధనలు లేవు కానీ జనసేన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలకు కోవిద్ నిబంధనలు సాకుతో పోలీస్ వారు శ్రమ దాన కార్యక్రమాలను అడ్డుకోవాలని హౌస్ అరెస్ట్లు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెంగారి శివ ప్రసాద్,కత్తి సుబ్బ రాయుడు,పలుకూరి రవి శంకర్, లతీఫ్, తాళ్లపాక శంకర్ రెడ్డి రాణి, జగిలి ఓబులేసు, పోలి హరి, రమణ, బాలు, కోలాటం హరి, పెనగాలూరు రాజేష్,బాల సాయి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.