తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు ఈవోగా సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి జవహర్ రెడ్డి ని నియమించారు. కడప జిల్లాకు చెందిన జవహర్ రెడ్డి 1990 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి.
ఆయన ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ఛీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఉండేవారు. ఆయనను అకస్మాత్తుగా ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆయన స్థానంలో ప్రస్తుత అదనపు ఈవో ధర్మారెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు జవహర్ రెడ్డి నియమితులు కావడంతో ధర్మారెడ్డి యధా స్థానానికి వస్తారు.
జవహర్ రెడ్డి నియామకంతో మూడు టాప్ పోస్టులు ఒకే సామాజిక వర్గానికి దక్కినట్లు అయింది.