దేవుడి కంటే కూడా నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా భయపడతాడని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకరర్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్లాపై, శ్రీశైలం మల్లన్నపై నమ్మకం లేదని, తిరుపతి వెంకన్నపై అసలే లేదని, యేసును కూడా నమ్మడని అహం ఎక్కువ అని ఆయన అన్నారు.
తుగ్లక్ పాలనలో కూడా ఇలాంటి పద్ధతి లేదని, ఈ దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి గతంలోనూ లేడు… రాబోయే రోజుల్లో కూడా రాబోడన్నారు. తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై స్పందించిన ఆయన..ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనన్నారు.