దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2023 పరీక్ష నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం వున్నది. జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ నవంబర్ 30నాటికి పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జేఈఈ మెయిన్ 2023 తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ ఈనెల 30లోగా నోటిఫికేషన్ వస్తే తొలి విడత పరీక్షకు వెనువెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుకానుంది. కాగా ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన నేపథ్యంలో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు jeemain.nta.nic.in వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
previous post
next post