జెట్ విమానం అత్యవసరంగా పొలాల్లో దిగడంతో అనంతపురం జిల్లాలో నేడు సంచలనం కలిగింది. జిందాల్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బళ్లారి నుండి బెంగళూరు కి వెళుతుండగా జెట్ విమానంలో ఇంధన సమస్య ఏర్పడింది. దాంతో అత్యవసరంగా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర వద్ద పొలాల్లో ల్యాండింగ్ చేశారు.
దాంతో పెద్ద సమస్య తప్పింది. లేకుంటే జెట్ విమానానికి ప్రమాదం వాటిల్లేదని అంటున్నారు. స్థానిక కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం, ఎరిడికెర గ్రామ సమీపాన పొలాల్లో ఇంధన సమస్యతో అత్యవసరంగా ఛాపర్ దిగడంతో గ్రామస్తులు దాన్ని ఆసక్తిగా గమనించారు.