ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా పనులు చేయించడానికి బద్దకించే ఈ రోజుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ సొంత ఖర్చుతో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు టీ ఆర్ ఎస్ నాయకుడు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ చొల్లేటి కిషన్ రెడ్డి. హుజురాబాద్ ప్రభుత్వ కళాశాలలో పేరుకు పోయిన చెత్త, చెట్లను చొల్లేటి కిషన్ రెడ్డి తన స్వంత ఖర్చులతో నేడు తీసివేయించారు.
ఎంతో మంది అక్కడకు రోజు వ్యాయామం, జాగింగ్, సైక్లింగ్ కోసం వస్తుంటారు. వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లను ఆయన చేసి ఆదర్శంగా నిలిచాడు. చెట్లను తీసి వేయించిన కిషన్ రెడ్డి అక్కడి మైదానం లో యాష్ పోయించి జా గింగ్ చేసే వారికి సహాయం చేయాలని కోరుతున్నారు.