33.2 C
Hyderabad
April 26, 2024 02: 02 AM
Slider నల్గొండ

యూత్ కాంగ్రెస్ లో చేరండి ప్రజా సమస్యలపై పోరాడండి

#uttamkumarreddy

సామాజిక స్పృహ కలిగి,ప్రజా సమస్యలపై పోరాడే యువకులకు యూత్ కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుందని హుజూర్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

సమస్యలను ప్రభుత్వం,అధికారుల  దృష్టికి తీసుకెళ్ళి ప్రజలలో యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీ తరపున ధైర్యాన్ని  కలిగించాలని మహేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ రోజు రోజుకు పటిష్టమౌతుందని,మాజీ పిసిసి అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృత స్థాయిలో మండల,గ్రామ కమిటీల నియామకం చేస్తు యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు.కమిటీలలో నియోజకవర్గం లోని అన్ని వర్గాల యువకులకు ప్రాధాన్యత కల్పిస్తు,వరుస సమావేశాలతో  ముందుకెళ్తున్నామని అన్నారు.రానున్న రోజులలో నియోజకవర్గం లోని ప్రజల సమస్యపై యూత్ కాంగ్రెస్ పోరాట ప్రణాళికలను రూపకల్పన చేస్తుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి సంఘటితంగా పనిచేస్తామని,యువకులు సోషల్  మీడియాలో చురకుగా ఉంటూ కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారాలను తిప్పి కొట్టాలని కుక్కడపు మహేష్ అన్నారు.యూత్ కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుదని,పని చేయకుండా పదవులు అనుభవించే వారికి ఉద్వాసన పలుకుతామని అన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

టీటీడీ ఆస్తులు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం

Satyam NEWS

డబ్బులు పంచే వాళ్లే ఓటర్లను విమర్శిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment