‘‘నా DNA అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం అనే ఒకే ఒక లక్ష్యంతో రైట్ పార్టీలో చేరుతున్నా’’ అంటూ ఈటల రాజేందర్ ప్రకటించారు.
శాసనసభ్యత్వానికి రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అయ్యారు.
బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
నేరుగా స్పీకర్ గారికి ఇద్దాం అనుకున్న కానీ స్పీకర్ గారు కరోనా అడ్డం పెట్టుకొని నన్ను కలవలేదు అని ఈటల అన్నారు. అనివార్య మైన పరిస్థితుల్లో రాజీనామా లేఖను సెక్రెటరీ కి ఇచ్చాను అని ఆయన తెలిపారు.
అసెంబ్లీ లో అంతా నియంతృత్వం నడుస్తున్నదని ఆయన తెలిపారు. అసెంబ్లీ ప్రజల ఆశలను ప్రతిబింబించాలి కానీ ఇక్కడ కెసిఆర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అమలవుతుందని ఆయన అన్నారు.
ఈ రాజ్యాంగం ఎంది, ఎమ్మెల్యే ఎంపీ లు ఎంటి అనే భావనలో కేసీఆర్ ఉన్నారని దాని ప్రతి ఫలమే ఈరోజు తనకు ఎదురైన అనుభవమని ఆయన తెలిపారు.