ప్రజా సంక్షేమ పాలన చేస్తున్న సీఎం జగన్ కు బాసటగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు నగరంలో ని 49వ డివిజన్ బీసీ కాలనీ యాత పేటలో నగర పార్టీ అధ్యక్షులు ఆసపు వేణు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా డివిజన్ పార్టీ నేతలు గార సత్యనారాయణ, కనుగుల రాజా నేతృత్వంలో గేడి సూరి, చుక్క తాతారావు, పెంటమాని రమేష్, చుక్క కూర్మారావ్, ఓడిమాని పెద్ద బంగారనాయుడు ల ఆధ్వర్యంలో 50 కుటుంబాలు ఎమ్మెల్యే కోలగట్ల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తనకు 1989 నుంచి కూడా యాతవిధితో అనుబంధం కొనసాగుతూనే ఉందన్నారు. డివిజన్ పరిధిలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు..సీఎం జగన్ నేతృత్వంలో పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు.
ప్రజలకు అండగా ఉంటూ ప్రజా అవసరాలు తీర్చేది కేరాఫ్ అడ్రస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దీనిని గుర్తించిన ప్రజలు నగరపాలక ఎన్నికలలో 50 డివిజనులకు గాను 48 డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని అన్నారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ పట్నాన పైడిరాజు, పార్టీ జోనల్ ఇన్చార్జ్ బోనసిం గి ఈశ్వరరావు లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు రహీం, జోనల్ ఇంచార్జ్ లక్ష్మణరావు (తమ్ము), పార్టీ నేతలు తాళ్లపూడి పండు, కంది రాంబాబు, తాళ్లపూడి రమణమూర్తి, కొసర నారాయణరావు 49వ డివిజన్ పార్టీ నేతలు ముత్యాల నాయుడు, నారాయణరావు, సత్తరవు సీతారాం తో పాటు డివిజన్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.