కడపలో సాక్షి రిపోర్టర్ గా పని చేస్తూ కరోనా కాటుకు బలైన మాచూపల్లె ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుస గా జరిగిన దారుణ ఘటన ఇది.
మంగళవారం ప్రభాకర్ రెడ్డి కరోనాతో చనిపోగా, బుధవారం వారి తండ్రి ఓబుళరెడ్డి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒక్క రోజు తేడాతో తండ్రి, కొడుకు ఇద్దరూ అకాల మృత్యువాతపడ్డారు. కనీసం చివరి చూపునకూ నోచుకోలేకపోయారు.
బంధాలు, అనుబంధాలు నిర్దాక్షిణ్యంగా తెంపేస్తున్న కరోనా మహమ్మారి నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు.