కడప జిల్లా రాజంపేట 99 టివి రిపోర్టర్,యన్. హెచ్.ఆర్.సి ఫోరమ్ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జీ,ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నియోజకవర్గ అధ్యక్షుడు సూరేపల్లె శ్రీనివాసులు (46) బుధవారం తెల్లవారు జామున గుండెపోటు తో రాజంపేట కృష్ణానగర్ లోని వారి స్వగృహంలో మృతి చెందారు.
అయనకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో స్నేహ టివి రిపోర్టర్ పని చేశారు. సంక్రాంతిని తన శ్రీమతి చిన్నారు లతో కలిసి సంబరంగా చేసుకోవడానికి నూతన వస్త్రాలు కొని తెల్లవారు జామున భోగి మంటలు వేసుకుందాం అనుకునే లోపు నిద్రలోనే గుండె పోటు రావడంతో కనుమూశారు.
దీనితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుము కున్నాయి.మృతుడు శ్రీను కుటుంబం ఆర్థికంగా స్థిరపడక పోవడం కొడుకు,కూతురు ఇద్దరూ చిన్నారులు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీనితో వారి కుటుంబాన్ని ఆదుకొనేందుకు జర్నలిస్టు సంఘాలు,ప్రభుత్వ పరంగా జగన్నన్న బీమా, జర్నలిస్టు హెల్త్ ఇన్సూరెన్స్ తదితరం ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలం గళం రాజంపేట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కోరారు.
సూరేపల్లె శ్రీను పార్టీవ దేహాన్ని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు,అఖిల భారత యాదవ సంఘం కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్,డి.ఆర్.యల్ .మణి తదితరులు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.