రోడ్డు ప్రమాదంలో ఒక జర్నలిస్టు మరణించిన దుర్ఘటన విశాఖపట్నం శివారులో జరిగింది. విశాఖపట్నం ఆనందపురం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మరణించిన జర్నలిస్టును తీర్థయాత్ర పేపర్ ఎడిటర్ చంద్రశేఖర్ గా పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ స్వస్థలం మధురవాడ మరికావలస. జర్నలిస్ట్ మృతి ఈ ప్రాంతంలో విషాదం నింపింది.