చిత్తూరు జిల్లాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన సివిఆర్ న్యూస్ వీడియో గ్రాఫర్ పార్థసారథి కుటుంబానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బండి సురేంద్ర బాబు పది వేల రూపాయలు పంపారు.
ఈ అమౌంట్ ను చిత్తూరు జిల్లా నాయకులు, సభ్యులు కలిసి ఈరోజు పార్థసారథి కుటుంబ సభ్యులకు అందజేసారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా నాయకులు కె.ఎల్ రెడ్డి, లోకేష్, నందకుమార్, జిలాన్ భాష, తిరుపతి ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.