మంచిర్యాల జిల్లా కేంద్రం ఎన్టీఆర్ నగర్ లో సుమారుగా 40 మంది వలసల కూలీల కుటుంబాలకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను సమకూర్చింది. ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పాల్గొన్నారు.
కరోనా లాక్ డౌన్ సందర్బంగా ఎంతో మంది పనులు లేక ఆకలి తో ఆలమట్టిస్తున్నరాని తెలిసి జర్నలిస్టులు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమనికి మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్యామలదేవి, DPRO సంపత్ హాజరయ్యారు.
ఇంకా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పార్వతి రాజేష్ కుమార్, జిల్లా కన్వీనర్ చొక్కారపు శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్లు నలివేటి మహేష్, కొండబత్తుల సతీష్ నేత, పార్వతి సురేష్ కుమార్, అప్జల్, డి.శంకర్, ప్రేమ్జీవన్, ఎన్ శ్రీనివాస్,రవికుమార్ రెడ్డి శారుజిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.