కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధంలో అలుపెరుగని కవరేజ్ చేస్తున్న సెంట్రల్ జోన్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం జరిగింది. శుక్రవారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
గోషామహల్ నియోజకవర్గం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు డి ఎస్ సుభాష్ కృష్ణ ను సినీ నటులు విజయ్ యాదవ్, జగన్ సన్మానించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు, గోల్డెన్ ప్రెస్ అధినేత సంజయ్ యాదవ్ మేచినేని శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.