39.2 C
Hyderabad
March 29, 2024 16: 23 PM
Slider ముఖ్యంశాలు

మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరంకు కోల ఎన్నిక

#journalist

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కోలా నాగేశ్వరరావు మున్నూరు కాపు సంఘం జర్నలిస్టుల పోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో సోమవారం కోలా నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడుగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిస్టుల ఫోరం సంఘ బలోపేతానికి తాను శక్తి వంచన లేకుండా తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.అర్హులైన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.డెస్క్ జర్నలిస్టులకు తప్పనిసరిగా హెల్త్ కార్డులు,అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు.ఈనెల చివరి వారంలో వరంగల్ నగరంలో జరగనున్న మున్నూరు కాపు సంఘం జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.తన నియామకానికి సహకారం అందించిన రాష్ట్ర కన్వీనర్ కె.లక్ష్మణ్ పటేల్,జిల్లా కన్వీనర్ వీరాంజనేయులు కు కోలా నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా ఉపాధ్యక్షుడుగా నాగేశ్వరరావు ఎన్నిక పట్ల హుజూర్ నగర్ జర్నలిస్టు నేతలు పలువురు తమ హర్షం వ్యక్తం చేశారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

చైనాతో కుమ్మ‌క్కు.. ఓలికి మ‌ళ్ళీ ప‌ట్టం క‌ట్టేరా?

Sub Editor

డాక్టర్ అనితా రెడ్డి కి ఉమెన్ ఎక్స్ లెన్సి -2023 అవార్డు

Satyam NEWS

ప్ర‌ధాని మోడీ తల్లి జ‌న్మ‌దినం సంద‌ర్బంగా స్వ‌చ్చ భార‌త కో క‌న్వీన‌ర్ బ‌ట్ట‌ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment