మృతి చెందిన, అనారోగ్యానికి గురైనజర్నలిస్ట్ లను ప్రభుత్వం ఆదుకోవాలని జర్నలిస్ట్ వెల్ఫేర్ సభ్యులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన జర్నలిస్ట్ ఎం మల్లేష్ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న విషయాన్ని గమనించిన జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఐదువేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చిన తమ వంతుగా సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామచందర్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు బాలయ్య కార్యదర్శి రాజన్న కోశాధికారి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
next post